India Corona: కొత్తగా 50,848 కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 50,848 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,00,28,709కు చేరింది.
- 68,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 2,89,94,855 మంది బాధితులు కోలుకున్నారు.
- కొత్తగా 1,358 మంది వైరస్ బారినపడి ప్రాణాలు వదిలారు. వైరస్ బారినపడి మొత్తం ఇప్పటి వరకు దేశంలో 3,90,660 మంది ప్రాణాలు కోల్పోయారు.
- ప్రస్తుతం దేశంలో 6,43,194 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ పేర్కొంది.