India Corona: లక్షకు దిగివచ్చిన కేసులు

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుగున్నాయి. రోజువారీ కేసులు లక్షకు దిగివచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,00,636 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్యం 2,89,09,975కు చేరింది.
గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,74,399 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. తాజా డిశ్చార్జిలతో కలిపి దేశంలో మొత్తం 2,71,59,180 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనా బారిన పడి 2427 మంది మృతిచెందారు. ఇప్పటి వరకు దేశంలో 3,49,186 మంది బాధితులు మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 14,01,609 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.