India Corona: కొత్తగా 26,964 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది.
- తాజా కేలులతో కలిపి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,35,31,498కి చేరింది.
- గత 24 గంటల్లో 34,167 మంది కోలుకున్నారు.
- ఇప్పటి వరకు దేశంలో 3,27,83,741 మంది కోలుకున్నారు.
- గత 24 గంటల్లో 383 మంది కొత్తగా మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- ఇప్పటి వరకు దేశంలో 4,45,768 మంది కరోనా వల్ల మరణించారు.
- ప్రస్తుతం దేశంలో మరో 3,01,989 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.
- ఇప్పటి వరకు దేశంలో 82,65,15,754 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.