రైల్వేట్రాక్పై ఇనుపరాడ్డు.. శబరి ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం

గుంటూరు (CLiC2NEWS): పట్టాలపై ఇనుపరాడ్డును కట్టారు దుండగులు. నల్లపాడు- గుంటూరు సెక్షన్ మధ్య రైలు పట్టాలపై ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలెట్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో ట్రైన్కు ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుండి వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ లోకోపైలెట్ మంజునాథ్ అప్రమత్తమై రైలును నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. అనంతరం లోకోపైలెట్, సిబ్బంది సహాయంతో రాడ్డును తొలగించారు. రైలు గుంటూరు స్టేషన్కు చేరుకుంది. అయితే పట్టాలపై రాడ్డును గుడ్డతో కట్టి ఉండటం వలన పథకం ప్రకారమే దుండగులు ఇనుపరాడ్డును పట్టాలపై ఉంచినట్లు సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. పైగా సిగ్నలింగ్ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా అట్టముక్కలు పెట్టారు. రైలు పరిమితమైన వేగంతో వెళుతున్నందున రైలును తొందరగా ఆపగలిగారు. లేకపోతే రాడ్డు విరిగి లోకో కింది భాగాన తగిలి మంటలు వ్యాపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
I may need your help. I tried many ways but couldn’t solve it, but after reading your article, I think you have a way to help me. I’m looking forward for your reply. Thanks.