రేపు సిరిసిల్ల కు సిఎం కెసిఆర్‌..

రాజన్న సిరిసిల్ల (CLiC2NEWS): రేపు (ఆదివారం) ఉదయం ముఖ్య‌మంత్రి కెసిఆర్ సిరిసిల్ల పర్యటనకు రానున్నారు.

ఉదయం 11.30 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో ముఖ్య‌మంత్రి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాలు అంద‌జేయ‌నున్నారు.

12.20 గంటలకు తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో నిర్మించిన అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ను ప్రారంభించ‌నున్నారు.

12.45 గంటలకు సిరిసిల్లలో నిర్మించిన నర్సింగ్ కళాశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం పాల్గొననున్నారు.

1.10 గంటలకు సిరిసిల్ల మండలం సర్ధాపూర్ లో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను ప్రారంభించనున్నారు.

1.40 గంటలకు ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్(కలెక్టరేట్) భవనాన్ని ప్రారంభించ‌నున్నారు. అధికారులతో ముఖ్య‌మంత్రి సమావేశం నిర్వహించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.