టీఆర్ఎస్ గూటికి ఎల్.రమణ?

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు సిఎం కె. చంద్రశేఖరరావుతో ఇవాళ భేటీ కానున్నారని తెలిసింది. ఎల్ రమణ టిఆర్ ఎస్లో చేరుతారనే ఊహాగానాలు ఇటీవల బాగా వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇతర పార్టీల్లో చేరారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కూడా ఆ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మరికాసేపట్లో ప్రగతి భవన్కు వెళ్లనున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్తో రమణ సమావేశమై పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్తో కలిసి రమణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే గులాబీ పార్టీలో చేరే అంశంపై సీఎం కేసీఆర్తో సమావేశం అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.