అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
మంచిర్యాల (CLiC2NEWS):
దొంగతనాలకు పాల్పడుతున్న రాంటేంకి సారయ్య, కమ్మటి వెంకటేష్, మానుపాటి శేకర్లను పోలీసులు ఆరెస్టు చేశారు. సింగరేణి ఆసుపత్రి సమీపంలో పోలీసులు వాహనాల తనిఖీ నిర్వహించగా.. ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మోటార్వెహికల్పై కనిపించారు. పోలీసు సిబ్బందిని చూసి వారు పారిపోతుండగా పట్టుకున్నారు. వీరు ముగ్గురు జల్సాలకు అలవాటుపడి డబ్బులు సరిపోక దొంగతనలు చేస్తున్నారని, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. వీరు గతంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చారని, మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వీరి వద్ద నుండి 79గ్రాముల బంగారు ఆభరణాలను,48 తులాల వెండి ఆభరణాలను,మోటార్ సైకిల్ మరియు నగదు రూ ,1,76,000 లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ జీవన్, సుధాకర్, సిబ్బంది సంపత్ కుమార్, మల్లేష్, రమేష్లను అభినందించి రివార్డ్లు అందజేశారు.