రేపు దేశ‌వ్యాప్తంగా వైద్య సేవ‌లు బంద్..

విశాఖ‌ (CLiC2NEWS): ట్రైనీ డాక్ట‌ర్ హ‌త్యాచారానికి నిర‌స‌న‌గా రేపు దేశ‌వ్యాప్తంగా అన్ని ఆస్ప‌త్రుల‌లో వైద్య సేవ‌లు నిలిపివేయ‌నున్నారు. ఈ మేర‌కు ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ (IMA) రాష్ట్ర అధ్య‌క్షుడు జ‌య‌చంద్ర నాయుడు తెలిపారు. కోల్‌క‌తాలో ట్రైనీ డాక్ట‌ర్ పై హ‌త్యాచారానికి నిర‌స‌న‌గా ఈ నెల 17న దేశ‌వ్యాప్తంగా వైద్య‌సేవ‌లు నిలిపియేయ‌డానికి ఐఎంఎ నిర్ణ‌యించింద‌ని జ‌య‌చంద్ర‌నాయుడు మీడియా స‌మావేశంలో తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స‌త్య‌ర‌మే న్యాయ విచార‌ణ జ‌రిపించి దోషుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని, వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. కోల‌క‌తా ట్రైనీ హ‌త్యా ఘ‌ట‌న‌ను నిర‌సిస్తూ దేశ‌వ్యాప్తంగా వైద్యులు నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా రేపు వైద్య సేవ‌లు నిలిపివేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.