చేనేత కళాకారులను ఘ‌నంగా స‌న్మానించిన మంత్రి కెటిఆర్‌

హైదరాబాద్ (CLiC2NEWS): దేశం గర్వించదగ్గ చేనేత కళాకారులు తెలంగాణ సొంతమని మంత్రి కెటిఆర్ అన్నారు. చేనేత రంగంలో విశిష్ట సేవలందించినందుకు భారత ప్రభుత్వ జాతీయ అవార్డు అందుకొన్న కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్, గజం భగవాన్‌, మెరిట్ సర్టిఫికెట్స్‌ విజేతలు సాయిని భారత్, దుద్యాల శంకర్, తడక రమేష్‌ను మంత్రి అసెంబ్లీలోని తన ఛాంబర్లో ఇవాళ (సోమ‌వారం) ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తమ వృత్తి నైపుణ్యంతో తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతి తెచ్చిన అవార్డు గ్రహీతులకు శుభాకాంక్షలు తెలిపారు. వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎల్. రమణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.