విద్యా సేవా ర‌త్న అవార్డును అంద‌జేసిన మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి

Minister Sabita presents the Vidya Seva Rathna Award

హైద‌రాబాద్ (CLiC2NEWS): గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ హైదరాబాద్ లో నిర్వహించిన గురుపూజోత్సవం- 2021 లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారం “విద్యా సేవా రత్న అవార్డు ను మంచిర్యాల జిల్లా జన్నారం మండ‌లం ZPSS KISTAPUR పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు కుర్ర శేఖర్- సంధ్యారాణి దంపతులకు తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ గోన రాజేందర్ రెడ్డి అందజేశారు.

అవార్డు గ్ర‌హీత‌లైన‌ ఈ ఉపాధ్యాయులు NMMS లో పాఠశాలను స్కాలర్ షిప్ లలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం లో నిలిపినందుకు చేసిన‌ విశేష కృషి కి హరిత హరం ఏర్పాటులో కృషికి, ssc లో సాంఘిక శాస్త్రం లో కృషికి గాను ఈ అవార్డ్ ను అందజేసినట్లు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ చైర్మన్ గోన రాజేందర్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.