AP: జనసేన పార్టీలోకి ఎంపి బాలశౌరి..

మంగళగిరి (CLiC2NEWS): మచిలీపట్నం ఎంపి బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్కల్యాణ్ సమక్షంలో ఆయన, కుమారుడు అనుదీప్కు జనసేన పార్టీ జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పవన్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని.. జనసేన కుటుంబ సభ్యుడిని కావడం సంతోషంగా ఉందని బాలశౌరి అన్నారు.