ప్రధాని మోడీకి ఎంపీల సన్మానం
న్యూఢిల్లీ (CLiC2NEWS): ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని మంగళవారం ఎన్డీయే ఎంపీలు ఘనంగా సన్మానించారు. ఈ రోజు ఎన్డీయే భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీ కి ముందు ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సన్మానించారు.
అమెరికా, భారత్ ట్రేడ్ డీల్ కుదరిన నేపథ్యంలో.. ప్రధాని మోడీకి కృషికి గానూ ఎంపీలు ఈ సన్మానం చేశారు.
పార్లమెంటులో అధికార, విపక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్డీయే ఎంపీల భేటీ ప్రధాన్యం సంతరించుకుంది. పార్లమెంటులో విపక్షాల ను ఎదుర్కొనే వ్యూహంపై ప్రధాని మోడీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా మరో వైపు కాంగ్రెస్ నాయకులు పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
आदरणीय प्रधानमंत्री जी का हार्दिक अभिनंदन! 🙏
भारत–अमेरिका के मध्य हुए महत्वपूर्ण व्यापार समझौते के लिए NDA संसदीय दल की बैठक में माननीय प्रधानमंत्री श्री @narendramodi जी का भव्य स्वागत, अभिनंदन एवं आभार व्यक्त किया गया। pic.twitter.com/4tXG0z3CcZ
— Dr. Mahendra Singh (@bjpdrmahendra) February 3, 2026
Also Read: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు