Nalgonda Accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం..

నల్లగొండ (CLiC2NEWS): నల్లగొండ జిల్లాలోని నార్కట్పల్లి – అద్దంకి రహదారిపై వల్లభాచెరువు వద్ద సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. కారు డివైడర్ను ఢీకొని పంటపొలాలల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. మృతులను చెర్లపల్లికి చెందిన గుండెమల్ల శ్రీకాంత్, జెర్రిపోతుల వెంకటేశ్వర గౌడ్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.