అన్న క్యాంటీన్‌ల‌కు నారా భువ‌నేశ్వ‌రి రూ. కోటి విరాళం

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఎపి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి ఎన్‌టిఆర్ మెమోరియ‌ల్ ట్ర‌స్ట్ త‌ర‌పున అన్న క్యాంటీన్‌ల‌కు రూ. కోటి విరాళం అందించారు. పేద‌ల క‌డుపు నింపేందుకు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తున్న అన్న క్యాంటీన్‌లు ఎంతో గొప్ప కార్య‌క్ర‌మం అని నారా భువ‌నేశ్వ‌రి అన్నారు. పేద‌వాడికి కూడు, గూడు, గుడ్డ అనేది ఎన్‌టిఆర్ నినాద‌మ‌ని.. ఆయ‌న స్ఫూర్తితో పేద‌ల ఆక‌లి తీర్చ‌డానికి త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మానికి త‌న వంతుగా విరాళం అందిస్తున్న‌ట్లు తెలిపారు. విరాళం చెక్కును రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణ‌కు అంద‌జేశారు.  ఆగ‌స్టు 15 నుండి అన్నా క్యాంటీన్‌లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.