జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి: ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తిపై ముఖ్య‌మంత్రి కెసిఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలోమంత్రులు, మేర్ల‌తో పాటు ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.
రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదవుతున్న నేప‌త్యంలో ఈ నెల 20 నుంచి నిర్వ‌హించాల‌నుకున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాల‌ని మంత్రులు, అధికారులు ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ను కోరారు. వారి విజ్ఞ‌ప్తి ప‌ట్ల సానుకూలంగా స్పందించారు. ఈ మేర‌కు జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని సిఎం సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల‌పాటు ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని సిఎం స‌మీక్ష‌లో నిర్ణ‌యించారు.

Leave A Reply

Your email address will not be published.