పోలీసుల అదుపులో డబ్బులు డిమాండ్ చేస్తున్న మాజీ మావోయిస్టులు

భూపాలపల్లి (CLiC2NEWS): జిల్లాలో ప్రజాప్రతినిధులను, కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్న మాజీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. కాళేశ్వరంలో కారులో అనుమానంగా ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్లు జయశంకర్ భూపాలపల్లి పోలీసులు వెల్లడించారు. ప్రజాప్రతినిధులను బెదిరించి రూ. 50 లక్షల డిమాండ్ చేశారన్నారు. వారి వద్ద నుండి కారు, ద్విచక్రవాహనం, రెండు డమ్మీ పిస్టోళ్లు, నాలుగు జిలిటెన్ స్టిక్స్, ఐదు మొబైల్ ఫోన్తు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.