క‌రీంన‌గ‌ర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురు మృతి

క‌రీంన‌గ‌ర్ (CLiC2NEWS): జిల్లాలోని కొత్త‌ప‌ల్లి మండ‌లం బావుపేట వ‌ద్ద ఆటో బోల్తాప‌డింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు మ‌ర‌ణించారు. వీరు మాన‌కొండూరు మండ‌లం ముంజంప‌ల్లి గ్రామానికి చెందిన మ‌ల్ల‌య్య‌, ఓద‌మ్మ, హారికలు గా పోలీసులు గుర్తించారు. వీరంతా వేముల‌వాడ‌కు వెళ్తుండ‌గా ప్ర‌మాదం జ‌రిగింది. స్థానికుల స‌మాచారం మేర‌కు పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. గాయ‌ప‌డిన ముగ్గురిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరి ప‌రిస్థితి విష‌మించ‌డంతో శుక్ర‌వారం మృతి చెందారు. ఈ ప్ర‌మాదంపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.