హైదరాబాద్లో రూ.3కోట్ల గంజాయి పట్టివేత
హైదరాబాద్(CLiC2NEWS) నగరంలో అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుండి 1,820 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.3కోట్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ సీలేరు నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తు న్నారని గుర్తించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధలో.. గంజాయిని సీజ్ చేశారు. దానిని తరలిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు.