తెలంగాణలో ఆర్టిసి బస్పాస్ ఛార్జీలు పెంపు..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఆర్టిసి బస్పాస్ ఛార్జీలు పెరిగాయి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టిసి) సాధారణ ప్రజలతో పాటు , స్టూడెంట్ పాస్ ధరలను 20% పైగా పెంచింది. ఈ ధరల పెంపుతో ఇటు సాధారణ ప్రజలకే కాకుండా విద్యార్థులపై కూడా భారం పడనుంది. రూ. 1,150 ఉన్న ఆర్డినరీ పాస్ ధరను రూ.1400కు పెంచారు. రూ. 1300 గా ఉన్న మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1600కు.. రూ. 1450 ఉన్న మెట్రో డీలక్స్ పాస్ ధరను రూ.1800కు పెంచారు. గ్రేటర్ హైదరాబాద్, గ్రీన్ మెట్రో ఎసి పాస్ ధరలను ఆర్టిసి పెంచింది. పెరిగిన కొత్త ఛార్జీలు నేటి నుండే అమలులోకి వచ్చాయి.