నిషేదిత పత్తి విత్తనాలు ప‌ట్టివేత‌

మంచిర్యాల (CLiC2NEWS): జిల్లా లోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారు నుండి ప్రభుత్వ నిషేధిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నఇద్ద‌రు వ్య‌క్తుల‌ను పోలీసులు ప‌ట్టుకున్నారు. నిషేధిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారన్న సమాచారం అంద‌డంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎల్లారం చర్లపల్లి గ్రామ శివారు నుండి వ‌స్తున్న బైక్ లను, అనుమానస్పద వ్యక్తుల‌ను పట్టుకొన్నారు. వారి వద్ధ నుండి సుమారు 20,000/- రూపాయలు విలువ గల 10 కిలోల నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.