ఉపాధ్యాయుల‌ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తాం.. హ‌రీశ్‌రావు

ఉపాధ్యాయుల బ‌దిలీలు, ప్ర‌మోష‌న్ల విష‌యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ సానుకూలంగా ఉన్న‌ట్లు మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.  స్టేట్ టీచ‌ర్స్ యూనియ‌న్ తెలంగాణ స్టేట్ (STUTS)  వ‌జ్రోత్స‌వాల‌లో రాష్ట్ర మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, నిరంజ‌న్ రెడ్డి ల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 75 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంఘం ఎస్‌టియుటిఎస్ అని.. టీచ‌ర్ల స‌మ‌స్య‌లు ప‌రిష్కిరించ‌టంలో ఈ సంఘం విశేషంగా కృషి చేస్తుంద‌న్నారు. అనంత‌రం ఎస్‌టియుటిఎస్ ప్ర‌త్యేక సంచిక‌ను, కొత్త సంవత్స‌రం డైరీ, నూత‌న కాలెండ‌ర్‌ను ఆవిష్క‌రించారు.

Leave A Reply

Your email address will not be published.