రిటైర్మెంట్ డబ్బులతో 100 మందికి సుకన్య సమృద్ధి యోజన..
ఢిల్లీ (CLiC2NEWS): ఉపాధ్యాయుడుగా సేవలందించి ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన సొమ్ముతో 100 మందికి సుకన్య యోజన ఖాతాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్రెడ్డి 35 సంవత్సరాలు ఉపాధ్యాయుడుగా, ప్రధానోపాధ్యాయుడుగా సేవలందించారు. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన రూ. 25 లక్షలు పోస్టాఫీసులో డిపాజిట్ చేశారు. ఈ అంశాన్ని ఆదివారం మన్కీ బాత్లో ప్రధా న మంత్రి నరేంద్రమోడీ ప్రస్తావించారు.