రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలలో కవి సమ్మేళనం..

జనగామ (CLiC2NEWS): రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా కవి సమ్మేళనం లో పాల్గొనే
రచయితలు దరఖాస్తులు రెండు రోజులలోగా అందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు.

జూన్ రెండవ తేదీన సాయంత్రం డిఆర్‌డిఎ కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటలకు నిర్వహించే కవిసమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సాంప్రదాయాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిని కవులు తమ రచనల ద్వారా తెలియ చేసేందుకు రచయితల పేర్లు, వారి రచనల వివరాలు, సెల్ నెంబర్‌ జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయంలో అందజేయాలని తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.