నీటిపారుదల శాఖ ఇఇ నివాసాలపై ఎసిబి దాడులు..

హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నీటిపారుదల శాఖ ఇఇ నూనె శ్రీధర్ నివాసాలపై అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) సోదాలు నిర్వహిస్తుంది. శ్రీధర్ ఎస్ ఆర్ ఎస్పి డివిజన్ -8లో ఇఇగా విధులు నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6, 7, 8 ప్యాకేజిల పనులను పర్యవేక్షించారు. ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజినీర్ల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. హైదారాబాద్ సిద్దిపేట, కరీంనగర్లలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఆదాయానికి మించిన ఆస్తులు కేసులో ఆయన నివాసాల్లో ఎసిబి తనిఖీలు చేపట్టింది.