ఇంట్లో నుండి బీరువా, నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి పట్టణ శివారులోని పాత ఎస్పిఆర్ కాలనీలో సోమవారం దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంటి నుండి నగదుతో పాటు బీరువాను సైతం ఎత్తుకెళ్లినట్లు సమాచారం. సిసి కెమెరాల్లో రికార్డు అయిన పుటేజ్ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీలైనంత తొందర్లోనే దొంగలను పట్టుకుంటామని దేవునిపల్లి ఎస్ఐ రంజిత్ పేర్కొన్నారు.