మంచిర్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత పర్యటన..

మంచిర్యాల (CLiC2NEWS): మంచిర్యాల జిల్లాలో బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటించారు. తెలంగాణ తల్లి విగ్రహానకి పూలమాల వేసి నివాళులరపించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బిజెపితో పొత్తు వద్దనేదే తన తాపత్రయమని.. ఆ పార్టితో కలిస్తే భవిష్యత్ లేదని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్నపుడే బిజెపితో కలవాలనే ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలిపారు. ఢిల్లీ మద్యం కేసులో తాను నిర్దోషినని.. కోర్టు కూడా అదే చెప్పిందన్నారు.