మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ కాన్వాయ్‌కు ప్రమాదం..

గ‌న్‌మెన్‌ల‌కు గాయాలు..

మ‌హ‌బూబాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర గిరిజ‌న, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి స‌త్వ‌వ‌తి రాథోడ్ కాన్వాయ్‌లోని రెండు వాహ‌నాలు ఢీకొన్నాయి. మంత్రి హైద‌రాబాద్ నుండి మ‌హ‌బూబాబాద్ వెళ్తుండ‌గా.. మ‌హ‌బూబాబాద్ జిల్లా మ‌రిపెడ‌లో కార్గిల్ సెంట‌ర్ సమీపంలో కాన్వాయ్‌కు జంతువు అడ్డు రావ‌టంతో డ్రైవ‌ర్ స‌డెన్ బ్రేక్ వేశాడు. ఆ వాహ‌నానికి వెనుక వ‌స్తున్న మ‌రో వాహ‌నం వేగంగా వ‌చ్చి ఢీకొట్ట‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో గ‌న్‌మెన్ల‌కు గాయాల‌య్యాయి. మంత్రి సుర‌క్షితంగా మ‌హ‌బూబాబాద్‌కు చేరుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.