రాష్ట్రంలోని రైతులకు శుభవార్త
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రైతులకు సర్కార్ శుభవార్తనందించింది. వరి బోనస్ బకాయిలకు సంబంధించిన నిధులను విడుదల చేసింది. వ్యవసాయం మరింత లాభదాయకంగా మార్చడం, సాగును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వరి క్వింటాల్ పై రూ.500 బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. దీని కోసం సన్న వడ్లకు బోనస్ గా రూ. 514.36 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేసిన 2.17 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతుంది. దీంతో పాటు పౌరసరఫరాల సంస్థ వరి బోనస్ కోసం రూ. 1939.58 కోట్లు విడుదల చేయనుంది.