పెళ్లైన కొన్ని గంటల‌లోపే న‌వ వ‌ధువు మృతి

పార్వ‌తీపురం మ‌న్యం (CLiC2NEWS): వివాహ క్ర‌తువు ముగిసిన కొన్ని గంట‌ల‌కే న‌వ వ‌ధువు మృతి చెంద‌డంతో కుటంబ స‌భ్యులంతా విషాదంలో మునిగిపోయారు. ఈ ఘ‌ట‌న పార్వ‌తీపురం మ‌న్యం జిల్లా మ‌క్కువ మండ‌లం ద‌బ్బ‌గ‌డ్డ గ్రామంలో చోటుచేసుకుంది. శుక్ర‌వారం రాత్రి 10 గంట‌ల‌కు అఖిల‌కు వివాహం జ‌రిగింది. అనంత‌రం ఆమె నీర‌సంగా ఉండ‌టంతో ప‌డుకుంది. బంధువులు ఎంత పిలిచినా స్పందించ‌క‌పోవ‌డంతో కుటుంబ స‌భ్యులు హుటాహుటిన మ‌క్కువ పిహెచ్‌సికి త‌ర‌లించారు. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో అక్క‌డి నుండి సాలూరు ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. ఆమెను ప‌రీక్షించిన వైద‌యుల ఆమె మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు.

Leave A Reply

Your email address will not be published.