టిఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు..
హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేశారు. నమస్తే తెలంగాణ ఎండి దీవకొండ దామోదర్రావు, డా. బండి పార్థ సారథి రెడ్డి, పారిశ్రామిక వేత్త వద్ది రాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు. ఈ ముగ్గురిలో ఒకరు రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రాజ్యసభ ఎంపిగా ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉండగానే బండ ప్రకాశ్ రాజీనామా చేశారు. ఆయనకు ఎమ్మెల్సీగా సిఎం కెసిఆర్ అవకాశం కల్పించారు. బండ ప్రకాశ్ రాజీనామా నేపథ్యంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి రేపటితో నామినేషన్ల గడువు ముగుస్తుండటంతో.. రేపు ఒకరు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న డి.శ్రీనివాస్ (డిఎస్), కెప్టెన్ లక్ష్మీకాంతరావు పదవీకాలం వచ్చేనెలలో ముగియనుంది. ఈ స్థానాల్లోనూ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 24 నుండి 31 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. వీరిద్దరు స్థానాల్లో మిగిలిన ఇద్దరు ఈ నెల 31లోపు నామినేషన్లు వేయనున్నారు.