TS: నేడు వరంగల్, యాదాద్రి లో పర్యటించనున్న సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సిఎం కెసిఆర్ నేడు వరంగల్, యాదాద్రి జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సిఎం పర్యటనకు సర్వం సిద్ధమైంది. అత్యాధునిక వసతులతో నిర్మించనున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రికి భూమి పూజ అనంతరం, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్, ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన భవనాలను ప్రారంభించనున్నారు. నేడు వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని కేసీఆర్ యాదాద్రికి చేరుకుంటారు. ఇప్పటికే యాదాద్రి నూతన ఆలయ పునర్నిర్మాణాల పనులను సీఎం పరిశీలించారు. రేపు దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎం పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.