TS Corona: కొత్తగా 5695 కేసులు.. 49 మరణాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 5695 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,56,485 కి చేరింది. ఇందులో 3,73,933 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
ఇక కరోనాతో రాష్ట్రంలో కొత్తగా 49 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,417కి చేరింది. తాజాగా జిహెచ్ ఎంసి పరిధిలో 1352 కేసులు నమోదయ్యాయి.