TS Corona: 7430 కేసులు.. 56 మరణాలు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కేసులు కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 7,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,50,790కి చేరింది. ఇందులో 3,67,727 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 56 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,368కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 80,695 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.