TS Corona: రాష్ట్రంలో 4వేలకుపైగా కొవిడ్ కేసులు..
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో కారోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,20,215 మందికి కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 4,207 మందికి కొవిడ్ పాజిటివ్గా తేలింది. ఒక్కరోజులో ఇద్దరు కరోనాతో మరణించారు. గడిచిన 24 గంటల్లో ఈవైరస్ బారి నుండి 1,825 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,633 యాక్టివ్ కేసులున్నాయి. ఈమేరకు వైద్యారోగ్య శాఖ బుటిటెన్ విడుదల చేసింది. ఒక్కరోజులో జిహెచ్ ఎంసి పరిధిలో 1,645 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.