TS Covid కొత్తగా 7,754 కేసులు.. 51 మర‌ణాలు

హైదరాబాద్‌ (CLiC2NWS): తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 77,930 కొవిడ్ నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రుపగా 7,754 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ శనివారం క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,43,360కి చేరింది. కొత్తగా 6,542 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 3,62,160 మంది కోలుకున్నారు.

గ‌డిచిన 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 51 మంది క‌రోనా బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం కొవిడ్ మృతుల సంఖ్య 2,312కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 78,888 యాక్టివ్‌ కేసులున్నాయి.

తాజాగా నమోదైన పాజిటివ్‌ కేసులు 

  • జీహెచ్‌ఎంసీలో 1,507
  • మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 630
  • రంగారెడ్డిలో 554
  • సంగారెడ్డిలో 325
  • కరీంనగర్‌లో 281
  • మహబూబ్‌నగర్‌లో 279
  • సిద్దిపేటలో 279
  • నిజామాబాద్‌లో 267
  • జగిత్యాలలో 255
  • సూర్యాపేటలో 242
  • వికారాబాద్‌లో 242
  • నల్లగొండలో 231
  • ఖమ్మంలో 230
  • మంచిర్యాలలో 216
  • వరంగల్‌ రూరల్‌లో 208
Leave A Reply

Your email address will not be published.