హిమాచ‌ల్‌ప్ర‌దేశ్‌ మాజీ ముఖ్య‌మంత్రి వీర‌భ‌ద్ర‌సింగ్ క‌న్నుమూత‌

సిమ్లా (CLiC2NEWS): హిమాచ‌ల్ ప్ర‌దేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు వీర‌భ‌ద్ర‌సింగ్‌(87) క‌న్నుమూశారు. ఆయ‌న కొంత‌కాలంగా అనారోగ్యం తో సిమ్లాలోని ఓ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో గురువారం తెల్ల‌వారుజామున తుదిశ్వాస విడిచారు.

1934 జూన్ 23న సిమ్లాలో జ‌న్మించిన‌ వీర‌భ‌ద్ర‌సింగ్ తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా, నాలుగుసార్లు ఎంపీగా అదేవిధంగా ఆరుసార్లు హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ సీఎంగా ప‌నిచేశారు.

Leave A Reply

Your email address will not be published.