ఎపిఎస్డిఎమ్కి విర్కోగ్రూప్ కంపెనీ భారీ విరాళం..
అమరావతి: ఎపి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎపిఎస్డిఎమ్) అథారిటి కి ఆంధ్ర ఆర్గానిక్స్ లిమిటెడ్ కోటి రూపాయల విరాళం అందించింది. కరోనా నివారణ సహాయక చర్యలకోసం, ఇటీవల వరదల వలన నష్టపోయిన ప్రాంతాలలో సహాయక చర్యల నిమిత్తం ఎపిఎస్డిఎమ్ కు విరాళం అందించారు. సిఎం క్యాంపు కార్యాలయంలో విర్కో గ్రూప్ ఆఫ్ కంపినీ డైరెక్టర్ ఎం.మహా విష్ణు అందజేశారు.