`పార్టీ మారిన ఎమ్మెల్యే సురేందర్ రాజీనామా చేయాలి..`
ఎల్లారెడ్డి (CLiC2NEWS): పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బి ఫాం మీద గెలిచి, అభివృద్ధి పేరుతో టిఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే నల్ల మడుగు సురేందర్ వెంటనే రాజీనామా చేయాలని ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున సదాశివ నగర్ ఎక్స్ రోడ్ లో ఎమ్మెల్యే సురేందర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.