రైతు శ్రేయస్సే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం: ఎమ్మెల్సీ తోట‌

మండపేట (CLiC2NEWS): రైతు శ్రేయస్సే ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం పని చేస్తుందని శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు అన్నారు. ఆదివారం మండలంలోని తాపేశ్వరంలో నాబార్డు నిధులతో నిర్మించనున్న డాక్టర్ వైఎస్సార్ ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్ భవనానికి ఆయన శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రంలో మేలు రకం విత్తనాలు, ఎరువులపై పరిశోధన జరిగిస్తారని రైతుల అనుమానం నివృత్తి చేసి విత్తనాలు ఎరువులపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. ఈ పరిశోధనా కేంద్రాలు జిల్లాలో 13 ఉండగా రాష్ట్ర వ్యాప్తంగా 147 కేంద్రాలున్నాయన్నారు. రూ 55 లక్షలతో నిర్మించనున్న ఈ ల్యాబ్ మండపేట నియోజక వర్గ రైతులకు చేరువలో ఉండి సేవలు అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు, ఎంపీపీ వుండమట్ల వాసు, తాపేశ్వరం సర్పంచ్ వాసంసెట్టి రాజ రాజేశ్వరీ శ్రీనివాస్, మెర్నిపాడు సర్పంచ్, ఆలమూరు వ్యవసాయ శాఖ ఏడీ సీహెచ్ కే వీ చౌదరి, ఏవో బలుసు రవి, ప్రత్యేక అధికారి ఓ రామకృష్ణ, ఎంపీడీవో ఐదం రాజు, పంచాయితీ కార్యదర్శి సుభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.