ఏపీలో కొత్తగా 95 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 95 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కాగా విశాఖ జిల్లాలో ఒకరు మృత్యువాత పడ్డారు. వైరస్ సోకి చికిత్సపొందుతూ ఇప్పటి వరకు 7157 మంది మృత్యువాతపడ్డారని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే తాజాగా వైరస్ బారినపడిన వారిలో 129 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో ఇప్పటివరకు 8,88,099 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.