జీహెచ్ఎంసీ ఎన్నికలు : తుదిదశకు కౌంటింగ్
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరింది. మరో గంటలోపు పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు 136 స్థానాలలో ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ -54 స్థానాలలో, బీజేపీ -41, ఎంఐఎం-39 స్థానాలలో విజయం సాధించాయి. కాంగ్రెస్ రెండుచోట్ల గెలుపొందింది. మరో 14 డివిజన్లలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిలో టీఆర్ఎస్ 5 స్థానాలలో, బీజేపీ 4 స్థానాలలో, ఎంఐఎం 3 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తుది ఫలితాల కోసం నగర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.