టీటీడీపీ మేనిఫెస్టో విడుదల

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీల తమ మేనిఫెస్టోలను విడుదల చేస్తున్నాయి. తాజాగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్టీయార్ భవన్లో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ సోమవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని రమణ గుర్తు చేశారు. మాటలకే పరిమైన టీఆర్ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించాలని ఆయన సూచించారు. టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడంతో పాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్ ఇస్తామని ఎల్ రమణ ప్రకటించారు.