తల్లిదండ్రులకు విషమిచ్చి.. తానూ తాగిన కొడుకు..

హైదరాబాద్ : కరోనాతో ఆర్థిక పరిస్థితులు తలకిందులు కావడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వైరస్ రాకుండా చేసే మందు అని నమ్మించి తెచ్చన విషాన్ని తాను తాగాడు. తల్లిదండ్రులకు ఇచ్చాడు. తండ్రి తాగాడు. వంటపనిలో ఉన్నతల్లి తాగడం మరిచిపోయింది. కొద్దిసేపటికి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న భర్త, కుమారుడిని స్థానికుల సాయంతో ఆమె ఆస్పత్రికి తరలించగా అప్పటికే కుమారుడు చనిపోయాడు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వివారల్లోకి వెళ్లితే.. బంజారాహిల్స్ హిల్స్ కాలనీలోని గిరిశిఖర అపార్ట్మెంట్లో నివసించే అల్లంపాటి రామిరెడ్డి (61), ఎ.శ్రావణి రెడ్డిలు భార్యాభర్తలు. వీరికి ఎ.అనీష్ రెడ్డి (33) కొడుకు ఉన్నాడు. అనీష్ రెడ్డి ఐటీ సంస్థల్లో క్యాంటీన్లు నిర్వహిస్తుంటాడు. ఆరు నెలలుగా కరోనా వల్ల ఐటీ సంస్థలన్నీ వర్క్ఫర్ హోం పెట్టాయి. దీంతో ఇతని క్యాంటీన్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. తీవ్ర మనస్థాపానికి గురైన అనీష్ రెడ్డి గత కొంత కాలంగా తీవ్రంగా మానసిక క్షోభలో ఉన్నాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకును చనిపోతే ఈ ఏజ్లో తల్లిదండ్రులు ఎలా బతుకుతారు అనుకున్నడో ఏమో అనీష్ రెడ్డి బుధవారం రాత్రి 11:10 ప్రాంతంలో గుర్తుతెలియని మందు ఇంటికి తీసుకువచ్చాడు. ఇది కరోనా రాకుండా ఉండే మందు అని నమ్మబలికాడు. మొదట తండ్రి రామిరెడ్డికి తాగించాడు. తల్లిని కూడా తాగమనగా తాను వంటచేస్తున్నాను తర్వాత తాగుతాను అని చెప్పడంతో అనీష్ రెడ్డి కూడా తాగాడు. కొద్దిసేపటికి భర్త, కొడుకు తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని ఆమె ఆస్పత్రికి తరలించింది. అనీశ్ అప్పటికే మృతిచెందాడు. రామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.