తెలంగాణలో 88,396కు చేరిన కరోనా కేసులు
తెలంగాణలో 88,396కు చేరిన కరోనా కేసులు
తెలంగాణలో ,396కు చేరిన కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ర్టంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1921 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ర్ట వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 22,046 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 1921 మందికి కోవిడ్-19 పాజిటివ్గా నిర్థారణ అయింది. దీంతో రాష్ర్టంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డవారి సంఖ్య,396కు చేరింది. తాజాగా కరోనాతో 9మంది మతి చెందగా.. మరణాల సంఖ్య 674కు పెరిగింది.
కరోనా నుంచి కొత్తగా 1210 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు 64,24 మంది పూర్తిగా కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ర్టంలో 23, 43 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 7,11,196 కరోనా పరీక్షల నిర్వహించారు. కేసుల విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్ లో 356, మేడ్చల్ 16, రంగారెడ్డి 134 కరోనా కేసులు నమోదయ్యాయి.
రాజధానిలో తగ్గి.. జిల్లాల్లో పెరుగుదల
రాష్ర్టంలో బుధవారం 1,931 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 6,475కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో 29 మందికి వైరస్ నిర్ధారణ కాగా, వరంగల్ అర్బన్లో 144, రంగారెడ్డిలో 124, కరీంనగర్లో 9, సంగారెడ్డిలో 6, నల్లగొండలో 4, ఖమ్మంలో 73, సిద్దిపేట, మేడ్చల్-మల్కాజిగిరిలో 71 మందికి కరోనా సోకింది. కొత్తగా 11 మంది కరోనాతో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 665కి చేరింది. ఒక్క రోజే 23,303 నమూనాలను పరీక్షించారు. 706 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది.
గురువారం రోజున సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలానికి చెందిన విశ్రాంత ఉద్యోగి చిన్న కుమారుడి(35)కి పాజిటివ్ రావడంతో ఆయన టెన్షన్కు గురై బుధవారం రాత్రి సోఫాలో కూర్చున్నవాడు కూర్చున్నట్లే కుప్పకూలాడు. విషయం తెలిసిన తల్లి (60) బెంగతో ప్రాణాలొదిలింది.
మేడ్చల్ జిల్లా నాగారంలో ఉంటున్న ఆస్వతి పీఎస్(26) కరోనా కారణంగా సీఏ పరీక్షలు జరుగకపోవడంతో మానసిక వ్యథకు గురైంది. భర్త విను ఎస్ నాయర్ ఇంట్లో లేని సమయంలో రాత్రి 11 గంటలకు బాల్కనీ నుంచి కిందికి దూకింది.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట పోలీస్ శిక్షణ కేంద్రంలో కరోనా బాధితుల సంఖ్య 30కి చేరింది. ఇక్కడ పెద్ద సంఖ్యలో సైబరాబాద్ జోన్ ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో గత వారం జరిగిన పెళ్లికి హాజరైన 35 మందికి పాజిటివ్ వచ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రామక్కపేట గ్రామానికి చెందిన 11 మందికి పాజిటివ్గా తేలింది. వీరిలో 10 మంది ఒకే కుటుంబం వారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిధి సింగరేణి ఏరియాల్లోని కంపెనీ ఆస్పత్రుల్లో గురువారం 3 మందికి వైరస్ నిర్ధారణ అయింది.