తెలంగాణాలో కొత్తగా 682 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ పెరగడం మొదలయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 682 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,74,540కి చేరింది. ఇందులో 2,65,367 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,696 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తాజాగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1477కి చేరింది. ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 761 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తెలంగాణాలో 55,645 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 58,68,233 పరీక్షలు జరిగాయి.