తెలంగాణలో కొత్తగా 299 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 299 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం ఉదయం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,91,666కు చేరింది. ఇందులో 2,85,898 మంది మహమ్మారి బారినుంచి బయటపడగా, 4191 మంది చికిత్స పొందుతున్నారు. మరో 1577 మంది బాధితులు వైరస్ ప్రభావంతో మరణించారు. కాగా, నిన్న ఒక్కరోజే 379 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మృతిచెందారు. మొత్తం యాక్టివ్ కేసుల్లో 2,395 మంది హోం ఐసోలేషన్లో ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. తాజా కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 57, మేడ్చల్ మల్కాజిగిరిలో 26, కరీంనగర్లో 24 కేసుల చొప్పున ఉన్నాయి.