తెలంగాణ‌లో కొత్త‌గా 267 పాజిటివ్ కేసులు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రం‌లో కొత్త‌గా 267 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. అలాగే గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనాతో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1583కు చేరింది. ఈ మేర‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ ఇవాళ ఉద‌యం హెల్త్‌బులిటెన్ విడుద‌ల చేసింది. కాగా రాష్ర్టంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395కు చేరుకోగా, ప్ర‌స్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 3,919. ఇప్ప‌టి వ‌ర‌కు 2,86,893 మంది క‌రోనా నుంచి కోలుకోగా, నిన్న 351 మంది డిశ్చార్జి అయ్యారు. ప్ర‌స్తుతం హోం ఐసోలేష‌న్‌లో 2,270 మంది ఉన్నారు. గ‌త 24 గంట‌ల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 55 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి.

Leave A Reply

Your email address will not be published.