తెలంగాణ‌లో పెరుగుతున్న ఉష్ణోగ్ర‌త‌లు

హైద‌రా‌బా‌ద్: తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్నాయి. ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలులతో పొడి‌వా‌తా‌వ‌రణం ఏర్పడింది. ఈ గాలుల‌తో రానున్న 3 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 డిగ్రీల మధ్య నమో‌దయ్యే అవ‌కాశం ఉన్నట్టు టీఎ‌స్‌‌డీ‌పీ‌ఎస్‌ తెలి‌పింది. రాష్ట్రంలో అత్యధికంగా కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌ జిల్లా వాంకి‌డిలో 38.1, కేర‌మె‌రిలో 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. హైద‌రా‌బా‌ద్‌‌లో 36 డిగ్రీల ఉష్ణో‌గ్రత న‌మోదైంది. మహ‌బూ‌బ్‌‌న‌గర్‌ జిల్లా చిన్న చింత‌కుంట మండలం వడ్డె‌మా‌న్‌లో 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమోదైంది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35 నుంచి 38.1 డిగ్రీల మధ్య నమోదవు‌తు‌న్నాయి.

Leave A Reply

Your email address will not be published.