తెలంగాణ కొత్తగా 177 కరోనా కేసులు

హైదరాబాద్: గత 24 గంటల్లో తెలంగాణలో 177 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అలాగా తాజాగా కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ గురువారం బులిటెన్ విడుదల చేసింది. కొత్తగా 198 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. కాగా రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,101 కు చేరుకుంది. ఇప్పటి వరకు 2,91,510 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు కరోనాతో పారాడి 1,606 మంది మృతిచెందారని బులిటెన్లో పేర్కొన్నారు.