బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం

భువనేశ్వర్: భారత్ రక్షణ పరిశోధన రంగంలో శరవేగంగా దూసుకుపోతున్నది. తాజాగా విస్తృత శ్రేణికి చెందిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ రేంజ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను విజయవంతంగా చేధించగల సామర్థ్యం కలిగి ఉన్నది. డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) చేపట్టిన పీజే-10 ప్రాజెక్టు కింద ఈ పరీక్ష చేపట్టారు. దేశీయంగా రూపొందిందిన బూస్టర్తో ఈ బ్రహ్మోస్ క్షిపణిని లాంచ్ చేశారు.
దీనిని అభివృద్ధిపరచిన శాస్త్రవేత్తల బృందాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి అభినందించారు. ఈ పరీక్ష విజయవంతం కావడం సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్కు దేశీయ సత్తా జతకూడటానికి బాటలు పరుస్తుందని చెప్పారు.
డీఆర్డీవో పీజే-10 ప్రాజెక్టు క్రింద ఈ పరీక్షను నిర్వహించినట్లు తెలిపారు. దేశీయ బూస్టర్తో దీనిని నిర్వహించారు. లక్ష్య పరిథిని పెంచి అభివృద్ధిపరచిన ఈ మిసైల్ను ప్రయోగించడం ఇది రెండోసారి. దీనికి దేశీయంగా అభివృద్ధిపరచిన ఎయిర్ఫ్రేమ్, బూస్టర్ ఉపయోగించారు.
బ్రహ్మోస్ అనేది రామ్జెట్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. దీనిని జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి, భూమిపై నుంచి ప్రయోగించవచ్చు. రష్యాలోని ఓ సంస్థతో కలిసి డీఆర్డీవో దీనిని అభివృద్ధిపరిచింది.